మేం చెత్త‌గా ఆడాం అందుకే ఓడి పోయాం

అయినా ఫైన‌ల్ కు చేరుకుంటామ‌న్న గిల్

ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన క్వాలిఫ‌య‌ర్ -1 మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది గుజ‌రాత్ టైటాన్స్. 92 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 33 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 93 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ స్పందించాడు.

బౌలింగ్ , ఫీల్డింగ్ ప్రదర్శనపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా జట్టు ప్రదర్శనలలో ఇది అత్యంత దారుణమైన వాటిలో ఒకటి అని పేర్కొన్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ రోజు తాముఇలా కుప్పకూలి పోతామని నేను అస్సలు ఊహించ లేద‌న్నాడు. మ్యాచ్ ఆరంభంలో మా చేతుల్లోనే ఉందన్నారు. కానీ ఒక అత్యంత పేలవమైన ఓవర్ తర్వాత, మ్యాచ్ ఊపు (momentum) పూర్తిగా వారి వైపు మళ్లిందన్నారు. అక్కడి నుండి ఆట స్వరూపమే పూర్తిగా మారి పోయింద‌న్నారు. ఇటువంటి కీలకమైన మ్యాచ్‌లో, మీరు ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తూ, ఇంత పేలవంగా ఫీల్డింగ్ చేస్తూ, క్యాచ్‌లను జారవిడుస్తూ ఉంటే ఇక ఎప్ప‌టికీ గెల‌వ‌లేమ‌ని అన్నారు శుభ్ మ‌న్ గిల్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *