newsseals.com
News

సీఎం విజ‌య్ గైర్హాజ‌ర్ పై ఎంపీ కామెంట్స్

VijayaBhaskar May 28, 2026
newsseals-MPChristopherTilak
Spread the love

దీనిని కూడా రాజ‌కీయం చేస్తే ఎలా..?

ఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలతో జరగాల్సిన సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం రద్దయిందని నేను అనుకోవడం లేదని అన్నారు. ఆయన తదుపరి పర్యటనను వాయిదా వేశార‌ని చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం అధికారిక పర్యటన మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు.

అందుకే త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ దీనిని పూర్తిగా ప్రధానమంత్రికి మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి, నీతి ఆయోగ్ సమావేశం కోసం ముఖ్యమంత్రి జూన్ 11వ తేదీన తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు ఎంపీ తిల‌క్. ఆ సమయంలో ఆయన రాహుల్, సోనియాలతో సమావేశమవుతారని నేను భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతానికి, మా మధ్య చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ సమావేశానికి గైర్హాజరు కావడం గురించి ఆందోళన చెందడానికి, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు అని అన్నారు.