జ‌న‌సేన సంప‌త్ నాయ‌క్ పై జ‌ర్న‌లిస్టులు ఫైర్

నాగేశ్వ‌ర్ కు వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై.. ఆయనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులను ఉద్దేశించి జనసేన తెలంగాణ నేత సంప‌త్ నాయ‌క్ తీవ్ర వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నాగేశ్వర్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు. అదే ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేతలు జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు.. బూతు పదాలతో రెచ్చి పోయారు. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు.

దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు జనసేన నాయకుడు సంపత్ నాయక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తప్పుడు మాటలపై క్షమాపణ చెప్పకుండా ఆవేశంగా ఏదేదో మాట్లాడటానికి సంపత్ నాయక్ ప్రయత్నించడంతో మరింత ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు అతన్ని క్షమాపణ చెబుతావా లేదా అని గట్టిగా నిలదీశారు. దీంతో సంపత్ నాయక్ సహా జనసేన నాయకులు మెల్లిగా అక్కడినుండి జారుకున్నారు. మంగ్లీ పై వచ్చిన ఆరోపణల విషయంలో బాధితుల తరపున గట్టిగా మాట్లాడిన సంపత్ నాయక్ ఇపుడు ఎందుకు సైలెంట్ అయ్యారంటూ మండిప‌డ్డారు జ‌ర్న‌లిస్టులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *