newsseals.com
News

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

VijayaBhaskar May 30, 2026
newsseals-ShivaShankarlotheti
Spread the love

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.

బలమైన గాలి, వర్షం కారణంగా ఈ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ. మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు శివ శంక‌ర్ లోతేటి. తద్వారా ఈ రెండు జిల్లాల్లో 19 మండలాలల్లోని 35 గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.