ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు 2728 కోట్లు విడుద‌ల‌

ప్ర‌క‌టించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్ష‌న్ దారుల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం రు.2728.67 కోట్లు విడుద‌ల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త‌గా 5606 స్పాజ్ ( భార్య / భ‌ర్త ) పెన్ష‌న్లు మంజూరు కాగా… ఈ ల‌బ్ధిదారుల‌కు రు 2.24 కోట్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసిన‌ట్టు మంత్రి తెలిపారు.

ఈ నిధులు అన్నీ జూన్ 1వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుంచే ల‌బ్ధిదారుల‌కు నేరుగా పంపిణీ చేస్తామ‌ని తెలిపారు కొండ‌ప‌ల్లి శ్రీనివాస్. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జూన్ నెలతో క‌లుపుకుని ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కోసం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింద‌న్నారు. అవ్వా తాత‌లు, నిరుపేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ నిధుల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల‌కు అందిస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *