104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు


పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి

గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30 లక్షల విలువ చేసే నగదు ప్రోత్సాహకాలు మంత్రి చేతుల మీదుగా ఇవ్వ‌డం ప‌ట్ల విద్యార్థులు ఆనందం వ్య‌క్తం చేశారు.. టెన్త్ తో పాటు సెకండ్ ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. టెన్త్, సెకండ్ ఇంటర్ లో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గంలో మొదటి అయిదు స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 20 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు రూ.3 వేల చొప్పున రూ.30 వేలు ఇచ్చారు.

తృతీయ స్థానంలో నిలిచిన 20 మంది విద్యార్థులకు రూ.2 వేలు చొప్పున రూ.40 వేలు అందజేశారు. మరో 120 మంది విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.లక్షా 20 వేలు ప్రోత్సాహక నగదు రూపంలో అందజేశారు .అత్యుమ్మ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సొంతంగా రూ.లక్ష నగదు, 200 స్కూల్ బ్యాగ్ లను మంత్రి సవిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ లో, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన నలుగురు విద్యార్థులకు రూ.25 వేల చొప్పున రూ.లక్ష లను మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *