ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డ్

237 .31 స్ట్రైక్ రేట్ తో 776 ప‌రుగులు చేసిన యంగ్ క్రికెట‌ర్

బీహార్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో వండ‌ర్ కిడ్ వైబ‌వ్ సూర్య‌వంశీ అరుదైన రికార్డు సాధించాడు. త‌ను ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ఒక సీజ‌న్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా వ‌ర‌ల్డ్ రికార్డ్ న‌మోదు చేశాడు. కాగా ఈ సీజ‌న్ లో 237.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. ఆటలోని అత్యంత ఉత్తేజకరమైన యువ ప్రతిభావంతులలో ఒకడిగా సూర్యవంశీ తనను తాను నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని నిజంగా ప్రత్యేకమైన ప్రతిభావంతుడిగా కొనియాడారు. భారత క్రికెట్‌లో అతను వేగంగా ఎదుగుతున్న తరుణంలో, ఆ యువ ఆటగాడి సహజ ప్రవృత్తులతో కోచ్‌లు, మార్గదర్శకులు జోక్యం చేసుకోకూడదని ఆయన కోరారు.

గత ఏడాది తన అరంగేట్ర సీజన్‌లోనే ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడిగా నిలిచిన సూర్యవంశీ, ఈసారి జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడా, పాట్ కమిన్స్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లపై నిర్భయమైన ప్రదర్శనలతో తన ఖ్యాతిని మరింత పెంచుకున్నాడు. ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించి మాట్లాడుతున్నారు, నేను అతను బ్యాటింగ్ చేయడం చూశాను . అది అద్భుతంగా ఉంద‌న్నాడు. అంటే అతను నిజంగా చాలా ప్రత్యేకమైన వాడు. కేవలం బంతిని కొట్టే సామర్థ్యం మాత్రమే కాదు, అతని మణికట్టు పనితీరు కూడా నన్ను ఎంతగానో ఆకర్షించిందని పేర్కొన్నాడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *