గుజ‌రాత్ టైటాన్స్ ఓట‌మిపై కోచ్ నెహ్రా సీరియ‌స్

VijayaBhaskar · June 1, 2026
Spread the love

అగ్ర‌శ్రేణి బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కొంప ముంచింది

అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవ‌సం చేసుకుంది ర‌జ‌త్ పాటిదార్ సారథ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు (ఆర్సీబీ). తొలుత బ్యాటింగ్ చేసిన ప్ర‌త్య‌ర్థి గుజ‌రాత్ టైటాన్స్ ను కేవ‌లం 155 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసింది. ప్ర‌ధానంగా ఆర్సీబ‌బీ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. ప్ర‌ధానంగా స‌లామ్ ధార్ 3 వికెట్లు తీస్తే భువ‌నేశ్వ‌ర్ కుమార్ , హేజిల్ వుడ్ చెరో 2 వికెట్లు తీసి శాసించారు. దీంతో 8 వికెట్లు కోల్పోయింది.

అనంత‌రం బ‌రిలోకి దిగింది ఆర్సీబీ. నిర్ణీత 18 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. 5 వికెట్లు కోల్పోయి 156 ర‌న్స్ చేసింది. ఐపీఎల్ టైటిల్ ను కైవ‌సం చేసుకుంది. ప్ర‌ధానంగా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ సూప‌ర్ షో చేశాడు. త‌ను మ‌రోసారి సత్తా చాటాడు. ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్ లో 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 75 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా మ్యాచ్ అనంత‌రం స్పందించాడు గుజ‌రాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా. త‌ను బ్యాట‌ర్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆరంభంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ (top order) ఆ విధంగా అవుటయ్యాక, మాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టంగా మారింది.

ఒకవేళ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఇంకొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేసి, సరైన షాట్లను ఎంచుకుని ఉంటే, మాకు ఈ మ్యాచ్ గెలిచే అవకాశం దక్కి ఉండేది. కానీ ఇంత కీలకమైన మ్యాచ్‌లో, పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోయి, ఆ విధంగా కుప్పకూలి పోతే గెలవడం దాదాపు అసాధ్యం.