ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఎవ‌రూ రావ‌ద్దు

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే

అమెరికా : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. త‌న ఆధ్వ‌ర్యంలో ఈనెల 6వ తేదీన శ‌నివారం పార్ల‌మెంట్ ముందు నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చాడు. ఈ సంద‌ర్బంగా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌జాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఈ నిర‌స‌న‌కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తుండ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ముగ్గురు కీల‌క‌మైన వ్య‌క్తుల‌ను అధికార ప్ర‌తినిధులుగా నియ‌మించాడు అభిజిత్ దిప్కే.

ఈ సంద‌ర్బంగా త‌ను కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. తాను భారత్‌కు తిరిగి వస్తున్న తరుణంలో ఢిల్లీ విమానాశ్రయం వద్ద గుమిగూడవద్దని తన మద్దతుదారులను, విద్యార్థులను కోరారు. దిప్కే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. మనం చట్టాన్ని గౌరవించే పౌరులం, కాబట్టి విమానాశ్రయం వద్ద ఎటువంటి గుంపులు లేదా నిరసనలు చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తన పార్టీ త్వరలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు కూడా దిప్కే ప్ర‌క‌టించాడు.

ఢిల్లీకి చేరుకునే ముందు దిప్కే వైఖరిలో వచ్చిన ఈ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *