త‌న కుమారుడి పేరుతో ఘాట్ వ‌ద్దు

VijayaBhaskar · June 6, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన నారా లోకేష్

విజ‌య‌వాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావ‌రి పుష్క‌రాల‌ను పుర‌స్క‌రించుకుని ఓ ఘాట్ కు త‌న పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డంపై. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌కు, చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో స్పందించారు నారా లోకేష్‌. ఏపీలో ‘దేవాన్ష్ ఘాట్’ వివాదం చెల‌రేగ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పుష్కర ఘాట్‌కు నారా దేవాన్ష్ పేరు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ చర్యను నారా లోకేష్ వ్యతిరేకిస్తూ ఇది “హాస్యాస్పదం” అని పేర్కొన్నారు.

రాజానగరం నియోజకవర్గంలోని ముని కూడలి వద్ద ఉన్న ఈ ఘాట్‌కు ఇప్పటికే “దేవాన్ష్ ఘాట్” అని పేరు పెట్టారని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. దీనిని రూ1 కోటి నిధులతో ఆదర్శవంతమైన ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారని ఆయన చెప్పారు. ఈ పరిణామంపై స్పందించిన లోకేష్, తన కుమారుడి పేరుతో ఏ ఘాట్‌కూ పేరు పెట్టకూడదని తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ పేరు పెట్టే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.