ప‌వ‌న్ క‌ళ్యాణ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌పై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చ‌రిత్ర ఎక్క‌డ‌..? ఆంధ్రా చ‌రిత్ర ఎక్క‌డ తెలుసుకుని మాట్లాడాల‌న్నారు. కావాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఇక్క‌డ ఎవ‌రూ చూస్తూ ఊరుకోర‌ని అన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ముమ్మాటికీ తెలంగాణ మాదేన‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ అన్న ప‌దం డిక్ష‌న‌రీలోనే లేద‌ని బక్క‌ని న‌ర్సిములు చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌కు సోయి అనేది లేద‌న్నారు క‌విత‌. తెలంగాణ మాదేన‌ని, మా జాగీరేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇది పవన్ కల్యాణ్ తాతా ముత్తాతల జాగీరు కాదన్నారు. ఆంధ్రకు చెందిన మీ విషపూరిత పంజా నుండి మిమ్మల్ని కాపాడటానికే మేము తెలంగాణను సాధించుకున్నాం అన్నారు. ఇప్పుడు, ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడంలో మీకున్న నైతికత ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *