ఈటెల‌ ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్

అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించిన పోలీసులు

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న వ‌ల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేద‌ని పేర్కొంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై ప‌లువురు ఎంపీ అనుచ‌రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేసిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈటలను విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్బీ కాలనీ ప్రాంతాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విదితమే.

దీనిపై బీజేపీ నాయకులు సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది బీజేపీలో. తదుపరి విచారణ నిమిత్తం వారిని కే పీ హెచ్ బీ పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకొన్న కూకట్ పల్లి బీజేపీ నాయకులు స్టేషన్ కు చేసుకున్నారు. ఏ ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు? దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ స్టేష‌న్ బ‌య‌ట ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *