జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జ‌ర్న‌లిస్టుల విన‌తి

హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలు
చేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈవిధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మీ ద్వారా సిఫారసు చేయాలని కోరారు.

సీనియర్ పాత్రికేయులకు, జాతీయ వెల్ఫేర్ ఫండ్, పెన్షన్, మీడియా కమిషన్ జాతీయ స్థాయిలో రిటైర్ సీనియర్ జడ్జితో ఏర్పాటు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు జాతీయ భద్రత కల్పించాలని వారు విన్నవించారు. ఈకార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, రత్న చోటి రాణి
తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *