యూన‌స్ వ‌ల్లే ఇండియాలో ఆడ‌లేక పోయాం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన లిట్ట‌న్ దాస్

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ క్రికెట‌ర్ లిట్ట‌న్ దాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఆడేందుకు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు. ఇందుకు త ప్ర‌ధాన కార‌కుడు బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అని ఆరోపించాడు. త‌న‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ఇండియాలో సెక్యూరిటీ స‌రిగా లేద‌ని, అందుకే తాము పంపించేందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని చెప్ప‌డాన్ని త‌ప్పుప‌ట్టాడు లిట్ట‌న్ దాస్. త‌ను హిందూ స‌మాజానికి చెందిన వ్య‌క్తి.

దీనికి లిట్టన్ దాస్ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాము పాకిస్థాన్‌లో కూడా ఆడాము. వాళ్ళు తుపాకులతో మా గదుల బయట నిలబడేవారు. దానికంటే ప్రమాదకరమైనది ఇంకేముంటుంది అని ప్ర‌శ్నించాడు లిట్ట‌న్ దాస్. మేము పాకిస్థాన్‌లో ఆడగలిగినప్పుడు, భారతదేశంలో ఎందుకు ఆడలేమంటూ ప్ర‌శ్నించాడు. ఇదే విష‌యాన్ని చెప్పిన‌ప్పుడు యూన‌స్ త‌న‌పై నోరు పారేసుకున్నాడ‌ని మండిప‌డ్డారు. నేను చెప్పిన‌ట్లు చేయాల‌ని అన్నాడ‌ని తెలిపాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *