ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్

హైద‌రాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేర‌కు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఈగిల్ ఫోర్స్ రాకపై సమాచారం అందగానే పరారయ్యాడు నీతూ భాయ్. కిరాణా దుకాణం వెనుక నుంచి గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలుకు నీతూ భాయ్ ఇంటికి వచ్చిన 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది ఈగిల్ ఫోర్స్

గతంలో పీడీ (PD) చట్టం కింద అరెస్టై జైలు నుంచి విడుదలైన నీతూ భాయ్ తిరిగి గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు సమాచారం అందుకుంది. రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారుల అనుమానం. అంటే దాదాపు కోటిన్న‌ర‌కు పైగానే దీని ద్వారా సంపాదిస్తున‌న్న‌ట్లు అంచ‌నా వేసింది. నీతూ బాయ్ ఎక్క‌డికి పారి పోయాడ‌నే దానిపై ఈగిల్స్ టీం సెర్చ్ ప్రారంభించింది. త‌న‌కు ఎక్క‌డి నుంచి గంజాయి పెద్ద మొత్తంలో అందుతోంద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టింది టీం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *