స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించ‌చారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాలేద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌ ఆటలో 48 మంది, ఖోఖోలో 49 మంది., జూడోలో 39 మంది, సాఫ్ట్‌బాల్‌లో 38 మంది, ఫెన్సింగ్‌లో 13 మంది ఉద్యోగాలు వచ్చాయ‌న్నారు.

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ , జూడో అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ ఎంపీ భరత్ ఉన్నార‌ని ఈ పోస్టుల కేటాయింపుల అక్రమాల‌లో వీరి ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్ సాధించిన క్రీడాకారుడికి మాత్రం ఉద్యోగం రాలేద‌ని దీనిపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ పోస్టుల‌ను ఎంత మొత్తానికి అమ్ముకున్నారో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పాల‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *