సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో కీల‌క అంశాల గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీ. ప‌లువురు త‌ను తీసుకు వ‌చ్చి టికెట్లు ఇచ్చి గెలిపించిన వారంతా ప‌క్క‌దారి ప‌ట్టారు. వారంతా బేష‌ర‌తుగా, బ‌హిరంగంగానే బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీని వెనుక మాస్ట‌ర్ మైండ్ కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడ‌నేది జ‌గ‌మెరిగిన బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ను ప్ర‌స్తుతం దీదీని వ్య‌తిరేకించి సీఎంగా కొలువు తీరిన బీజేపీకి చెందిన సువేందు అధికారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న‌తో భావోద్వేగ బంధం ఉందని చెప‌ప్పారు. నాకు లోక్‌సభ సీటు నిరాకరించినప్పుడు రాత్రంతా ఏడ్చాను. సువేందు నాకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. నేను కరీంపూర్ నుండి పోటీ చేసినప్పుడు, నా కోసం ఎవరూ ప్రచారం చేయలేదు. ఒక్కరూ కాదు. కేవలం సువేందు మాత్రమే వచ్చి నా కోసం ప్రచారం చేశార‌ని కితాబు ఇచ్చారు. మేమిద్దరం కలిసి పార్టీలో ఉన్నప్పుడు, ఆయన నాకు చాలా మద్దతు ఇచ్చార‌ని పేర్కొన్నారు ఎంపీ.

  • Related Posts

    ఎంపీ రేణుకా చౌద‌రి వినూత్న ప్ర‌ద‌ర్శ‌న

    న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టంలో గుర్తింపు పొందారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది ప్రాంగ‌ణం. కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని వినూత్నంగా నిర‌స‌న…

    భూములు కోల్పోయిన రైతుల‌కు ఎంపీ భ‌రోసా

    వ‌న‌ప‌ర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. మహబూబ్‌నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *