newsseals.com
News

నేటి నుంచి తెలంగాణ‌లో ఇంటింటి స‌ర్వే

VijayaBhaskar June 25, 2026
newsseals-SirSurvey
Spread the love

స‌ర్ ప్ర‌క్రియ‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

హైద‌రాబాద్ : జ‌నాభా గ‌ణ‌న‌కు సంబంధించిన ఇంటింటి స‌ర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభ‌మైంది. ఈ స‌ర్ స‌ర్వే వ‌చ్చే నెల జూలై 24 వ‌ర‌కు కొన‌సాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,25,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు BLO లు. హైదరాబాద్ లో ఇంగ్లీష్ లో, మిగత జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందజేస్తారు. మొత్తం 119 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 35 వేల 985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఫ్యామిలి మ్యాపింగ్ 2,38,62,322 ఉండ‌గా అన్ మ్యాపింగ్ 99,64,126 ఓట‌ర్లు ఉన్నారు. మొత్తంగా సేక‌రించిన స‌ర్వే ఆధారంగా ముసాయిదా జాబితాను జూలై 31న ప్ర‌చురించున్న‌ట్లు ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీఈఓ వెల్ల‌డించారు.

త‌మ ఓటుకు సంబంధించి ఏవైనా అనుమానాలు కానీ లేదా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే జూలై 31 నుంచి ఆగ‌స్టు 30వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బీఎల్ ఓలు , ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని కోరారు. లేక పోతే మీకే ఇబ్బంది అవుతుంద‌ని పేర్కొన్నారు. సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు గాను జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వ‌ర‌కు గ‌డువు విధించామ‌న్నారు.