బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి

బేరి రామచందర్ యాదవ్ డిమాండ్

హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ కి బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. మియాపూర్ ఓబీసీ మోర్చా సమావేశం మ‌దీనగూడ భూమి బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నందున 54 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని, పేద వర్గాలైన 132 బీసీ కులాలకు అన్ని విధాల సహాయ పడాలని కోరారు.

బీసీ కులాల్లో ఎక్కువగా పేదలు ఉన్నార‌ని వారికి విద్య‌, వైద్యం అందించేందుకు కృషి చేయాల‌ని విన్న‌వించారు. ముద్ర లోన్లు, సబ్సిడీ లోన్స్ మిగతా అన్ని సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అన్ని బీసీ కుల సంఘాలకు వర్తించే విధంగా వృత్తి ధర్మంగా 132 కులాలకు సహాయం చేయాలని కోరారు రైతుల్లో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని వాపోయారు. బ్యాంకు లోన్లు ఇవ్వ‌క పోవ‌డంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నార‌ని పేర్కొన్నారు. స‌బ్సిడీ కింద విత్త‌నాలు, ఎరువులు ఇవ్వాల‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *