లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

రావాల‌ని కోరిన అధ‌వ అర్జున‌, తిరుమాళ‌వ‌న్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జూలై 1న త‌న నేతృత్వంలో జ‌రిగే ఈ స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా టీవీకే పార్టీ అధికార ప్ర‌తినిధి, మంత్రి అధ‌వ అర్జున ప్ర‌తి పార్టీని పాల్గొనాల‌ని స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అర్జున వీసీకే ప్రెసిడెంట్, ఎంపీ తిరు తిరుమావ‌ళ‌న్ ను క‌లిశారు. రావాల‌ని కోరారు. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు క‌లిసి టీవీకే మిత్రపక్షాల సమావేశానికి ‘లిబరేషన్ పాంథర్స్ పార్టీ’కి ఆహ్వానించారు.

ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతూ గ్రామీణాభివృద్ధి, నీటి వనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్, అలాగే ప్రజా పనులు , క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున స్వయంగా కలిసి ఆహ్వానాన్ని అందించడం విశేషం. ఇదిలా ఉండ‌గా టీవీకే పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను కైవ‌సం చేసుకుని కూట‌మితో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని విస్తు పోయేలా చేశారు టీవీకే పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. రేపు జ‌రిగే ఈ కీల‌క స‌మావేశం లో ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *