నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న హెచ్ ఎండీఏ
హైదరాబాద్ : ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ నగర పాలక సంస్థ (హెచ్ ఎండీఏ).
బంజారాహిల్స్ నుండి PVNR ఎక్స్ప్రెస్వే వరకు 3 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనుంది.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి రవాణా సౌలభ్యాన్ని మెరుగు పరచడానికి, బంజారాహిల్స్లోని జీవీకే మాల్ నుండి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే వరకు 3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని యోచిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బంజారాహిల్స్ నుండి మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సమీపంలో ఉన్న PVNR ఎక్స్ప్రెస్వే వరకు 3 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని ప్రణాళిక చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ బంజారాహిల్స్లోని GVK వన్ మాల్ వద్ద ప్రారంభమై, మసబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నంలోని PVNR ఎక్స్ప్రెస్వేకు అనుసంధానించ బడేలా రూపొందించ బడుతోంది.
ఈ మార్గంలో ఐదు ర్యాంప్లతో పాటు, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి మాసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద నాలుగు లేన్ల అండర్పాస్ను కూడా ప్రతిపాదించారు. కన్సల్టెన్సీ ద్వారా సర్వేలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక సమర్పించి, రెండేళ్లలో ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపాదిత కారిడార్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణ మార్గాన్ని కల్పించడంతో పాటు మాసాబ్ ట్యాంక్, లక్డికాపూల్, ఖైరతాబాద్ , సోమాజిగూడ వంటి కీలక జంక్షన్ల వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో ఉంది. ఈ ఎలివేటెడ్ మార్గం విమానాశ్రయానికి వెళ్లేందుకు రద్దీ సమయాల్లో పట్టే ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది .















