నాగ దుర్గ ‘దేవులాట పిల‌గా’ సాంగ్ సెన్సేష‌న్

హైద‌రాబాద్ : యూట్యూబ్ ను షేక్ చేస్తోంది జాన‌ప‌ద క‌ళాకారిణి, న‌టి నాగ‌దుర్గ కీ రోల్ పోషించిన‌ జాన‌ప‌ద గీతం దేవులాట పిల‌గా సాంగ్. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే 15 లక్ష‌ల మందికి పైగా వీక్షించారు. ప్ర‌స్తుతం దీనిని ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. ఇవాళ అటు ఏపీని ఇటు తెలంగాణను, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తెలంగాణ ప్రాంతానికి చెందిన పాట‌లు, జాన‌ప‌ద గేయాలు ఎక్కువ‌గా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఒక‌ప్పుడు ఈ ప్రాంతం ప‌ట్ల, యాస‌, భాష ప‌ట్ల ఏవ‌గింపు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అత్య‌ధికంగా సినిమా పాట‌లకంటే తెలంగాణ జాన‌ప‌ద గీతాలు టాప్ లో కొన‌సాగుతున్నాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. పాల‌మూరు జిల్లాకు చెందిన రాము రాథోడ్ చేసిన సాంగ్ ప్ర‌పంచంలోనే టాప్ వ్యూయ‌ర్ షిప్ సాధించింది. రికార్డును సృష్టించింది.

తాజాగా నాగ దుర్గ తో చేసిన దేవులాట పిల‌గా సాంగ్ దూసుకు పోతోంది. ప్ర‌త్యేకించి ఒక ఆడ‌పిల్ల తను ప్రేమించిన పిల‌గాడి కోసం ప‌ల‌వ‌రించేలా చేసింది ఈ పాట‌. ఇప్పుడు అమ్మాయిల‌కు ఇది చాలా ఇష్టంగా మారి పోయింది. అత్య‌ధికంగా రీల్స్ కూడా వ‌స్తున్నాయి. ఇక దేవులాట పిల‌గా పాట‌కు శేఖ‌ర్ వైర‌స్ కొరియోగ్ర‌ఫీ అద్భుతంగా చేశాడు. మ‌రోసారి తెలంగాణ పాట‌ల‌కు పెట్టింది పేరైన సంగీత ద‌ర్శ‌కుడు మదీన్ ఈ పాట‌కు ప్రాణం పోశాడు. ప్ర‌తి ఒక్కరినీ ఆక‌ట్టుకునేలా, అల‌రించేలా ట్యూన్ క‌ట్టాడు. దేవులాట పిల‌గా పాట‌ల‌ను ర‌మేష్ ప‌గిళ్ల రాశాడు.

  • Related Posts

    యాంక‌ర్ అన‌సూయ‌పై బీజేపీ నేత‌ల ఫిర్యాదు

    హైద‌రాబాద్ : జై శ్రీ‌రామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌ముఖ యాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ , త‌దిత‌ర హిందూ…

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *