కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
కేరళ : కేరళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న వయనాడు కొండ చరియలు విరిగి పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంగా దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం వీడీ సతీశన్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండు వారాల క్రితమే పనులు నిలిపి వేయాలని పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఆదేశించారు. వయనాడ్ సొరంగ మార్గం నిర్మాణ ప్రాంతం సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో ఆ నిర్మాణం కూలి పోయింది. తవ్వకం ద్వారా వెలికితీసిన మట్టిని తొలగించాలన్న అధికారుల ఆదేశాలను, అలాగే జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలను కాంట్రాక్టర్లు పాటించడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి సతీశన్ ఆరోపించారు.
ఈ ఘటనపై స్పందించిన కేరళ మంత్రి టి. సిద్ధిక్, వయనాడ్లోని కల్లాడి వద్ద జరిగిన ఈ ప్రమాదం నిర్లక్ష్యం వల్ల సంభవించిన మానవ తప్పిదం అని ఆరోపించారు. ప్రమాద ముప్పు గురించి కొంకణ్ రైల్వేస్ను అధికారులు ముందుగానే హెచ్చరించినప్పటికీ, ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి హీరా కుమార్ (32), దిలీప్ (19), సూరజ్ యాదవ్ (25), సంజయ్ ఠాకూర్ (35), రజనీష్ (27), తన్మయ్ ఘోష్ (28), కూపమల్ (జయ) (37) మరియు కుంజు (39) అనే ఎనిమిది మందిని రక్షించి, చికిత్స కోసం మెప్పాడిలోని WIMS ఆసుపత్రికి తరలించారు.