ఐదుగురు గ్రూప్ -1 ఆఫీసర్లకు ఐఏఎస్ లుగా పదోన్నతి
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు IAS కేడర్కు పదోన్నతి కల్పించింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. వివిధ శాఖలలో పనిచేసిన ఐదుగురు ‘నాన్-స్టేట్ సివిల్ సర్వీస్’ (Non-SCS) గ్రూప్-1 అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) కేడర్కు పదోన్నతి కల్పించారు. భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్’ (DoPT) దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. వీరి పేర్లు 2024 నాటి ఎంపిక జాబితా ఆధారంగా ఖరారు చేయబడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం నాడు ఈ ఐదుగురు అధికారులకు IAS కేడర్కు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారులు: ప్రభాల గోపీనాథ్, గుడిస బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఎ.ఎ.ఎల్. పద్మావతి , డాక్టర్ వరప్రసాద్ మామిళ్ళపల్లి. వీరు గతంలో వివిధ శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు . త్వరలో కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. రాష్ట్రంలో IAS అధికారుల కొరతను తీర్చడంలోనూ, పరిపాలనను మరింత బలోపేతం చేయడంలోనూ, అలాగే ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు , ప్రజలకు సేవలు అందించడంలోనూ ఈ పదోన్నతులు ఎంతగానో దోహదప డతాయని AP సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీరికి కొత్త పోస్టింగ్లను కేటాయించే అవకాశం ఉంది.