గాన కోకిల‌ ఎస్. జానకి మృతి బాధాక‌రం : జ‌గ‌న్

అమ‌రావ‌తి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన జాన‌కి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.

తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్తించిన‌ట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని పేర్కొన్నారు.

  • Related Posts

    ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్ పై శివ చ‌ర‌ణ్ రెడ్డి బూతు పురాణం

    యాదాద్రి న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా యాద‌గిరిగుట్ట ఆల‌యానికి సంబంధించి పాల‌క మండ‌లిని ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది సర్కార్. త‌న‌కు తెలియ‌కుండానే క‌మిటీని ఎంపిక చేశారంటూ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం…

    నిర్మాణం, నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్లే కాళేశ్వ‌రం డ్యామేజ్

    హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాల‌న్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *