ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం

హైదరాబాద్ : తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మైలు రాయిని సాధించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత , మరింత మానసిక ప్రశాంతతను కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ విప్లవాత్మక కార్యక్రమం మరింత బలపరుస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులు, పింఛనుదారులు , వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతలో శుక్రవారం ఒక కీలక అడుగు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
నగదు రహిత చికిత్స, విస్తృత ఆసుపత్రుల నెట్వర్క్, మెరుగైన పారదర్శకత, సులభమైన డిజిటల్ వేదిక ద్వారా నాణ్యమైన, అందుబాటులో ఉండే , సరసమైన ఆరోగ్య సేవలను అందించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పానికి ఈ ‘కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (New Employees Health Scheme) నిదర్శనమని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత, మరింత మానసిక ప్రశాంతతను కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ విప్లవాత్మక కార్యక్రమం మరింత బల పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉద్యోగుల సంక్షేమం , ఆరోగ్యం కోసం తమ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.