తమిళనాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా త్రిష్ కృష్ణన్
చెన్నై : తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు నటి త్రిష కృష్ణన్ చుట్టూ తిరుగుతున్నాయి. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కావేరి సమస్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు డీఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్. తను ఉన్నట్టుండి నోరు పారేసుకున్నాడు త్రిషపై. తంజావూరులో నిర్వహించిన నిరసన సభలో కావేరీ జలాల విషయంలో విజయ్ విఫలమయ్యారని ఆరోపిస్తూనే మరోసారి ‘త్రిష’ పేరును ప్రస్తావించారు.
ఉదయనిధి ప్రసంగిస్తుండగా, కార్యకర్తలు త్రిష పేరుతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని వారించడానికి బదులుగా, ఆయన ద్వంద్వార్థాలు కలిగిన మాటలతో వారిని మరింత ప్రోత్సహించారు. ఇది కేవలం ఆ నటిని మాత్రమే కాకుండా మహిళలందరినీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన టీవీకే కార్యకర్తలు, ఉదయనిధి నివాసాన్ని ముట్టడించారు. ఇతర ఎమ్మెల్యేలను అరెస్టు చేయించిన విజయ్ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్పై కూడా అదే స్థాయి చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఈ వ్యవహారం అరెస్టు వరకు వెళ్తుందా? అన్నది ఇప్పుడు సెంటర్ ఆఫ్ గా మారింది.