ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు
అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాసన సభ, శాసన మండలి సమావేశాల తేదీలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శాసనసభ , శాసనమండలి సమావేశాలను ఆగస్టు 17న నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాలులో ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు అని సోమవారం విడుదలైన అధికారిక ప్రకటన పేర్కొంది. అలాగే, అదే రోజు (ఆగస్టు 17) ఉదయం 10 గంటలకు వెలగపూడిలోని శాసనమండలి హాలులో మండలి సమావేశం అయ్యేలా ఆయన ఆదేశాలు జారీ చేశారని ఆ తెలిపింది. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రత్యేకించి రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించిన పాలసీని ప్రకటించింది. ఈ మేరకు రూ. 1500 కోట్లు వీజీఎఫ్ కు మంజూరు చేసింది.