ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు : నారా లోకేష్
అమరావతి: ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయలేదన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6 శాతం తగ్గాయని చెప్పారు. 2023-24 ఏడాదిలో 3.03శాతం తగ్గాయి. 2024-25లో 3.24 శాతం తగ్గినట్లు, దీనికి కారణం తాము తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితమేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫేక్ వివరాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలను నివారించడం జరిగిందని పేర్కొన్నారు. నకిలీ డేటాను తొలగించాం. దీంతో 2025-26లో 1.69 శాతం ప్రవేశాలు తగ్గాయన్నారు మంత్రి. 2026-27 ఏడాదికి వచ్చేసరికి 0.94శాతం ప్రవేశాలు పెరిగాయని స్పష్టం చేశారు.