శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో సేవలకు గుర్తింపు

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుక్లా హాజ‌ర‌య్యారు. విశాఖ శారదా పీఠాధిప‌తి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ , శ్రీ శ్రీ స్వాత్మ నందేంద్ర మహాస్వామిజీ వారి ఆధ్వర్యంలో స్త్రీశక్తి సనాతన శక్తి కార్యక్రమం లింగంపల్లి చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

ఈ దివ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల . కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. స్త్రీ శక్తిని జాగృతం చేసే సనాతన శక్తిని గౌరవించే విధంగా ప్రముఖ స్త్రీ మూర్తులు ప్రసంగించిన ఈ కార్యక్రమంలో చేవెళ్ల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలు, దుర్గావాహిని తెలంగాణ ప్రాంత కన్వీనర్ వాణి సక్కుబాయి కి గవర్నర్ చేతుల మీదుగా ప్రశంస ప‌త్రం, సన్మానం నిర్వహించడం జరిగింది. మహిళల లో సాధికారత, విద్యాభ్యాసం, సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు సన్మానించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శుక్లా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు.

  • Related Posts

    ఇస్కాన్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం : ఈట‌ల

    హైద‌రాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ…

    సింహాచ‌లం స‌న్నిధిలో బీజేపీ చీఫ్ నితిన్ న‌బిన్

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖప‌ట్నం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్. ఈ సంద‌ర్బంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *