అనుపమ కామెంట్స్ పై నోరు విప్పిన ధృవ్ విక్రమ్

చెన్నై : వర్దమాన నటి అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్రమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన నుంచి తాను తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. దీనిపై స్పందించారు ధృవ్ విక్రమ్. ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడైన ధృవ్ ‘బైసన్ కళామండన్’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్తో కలిసి నటించారు. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావించారు. గతంలో ఒక మాజీ భాగస్వామితో రెండేళ్లపాటు సాగిన బంధంలో నియంతృత్వ, అహంభావ ధోరణిని ఎదుర్కొన్నట్లు నటి అనుపమ పరమేశ్వరన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మీడియా రౌండ్టేబుల్ సమావేశంలో ధృవ్ మాట్లాడుతూ, ప్రజల పరిశీలన లేదా విమర్శలు సహజంగానే ఒక వ్యక్తిపై ప్రభావం చూపుతాయని అంగీకరించారు.
వాస్తవికతకు కట్టుబడి ఉండటం ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. క్లిష్ట సమయాల్లో తనను తాను తెలుసుకోవడం , ప్రియమైన వారిని రక్షించు కోవడం తన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. అంతర్గత స్పష్టత అనేది ప్రజల ఊహాగానాలను ఎదుర్కోవడంలో సహాయ పడుతుందని, తద్వారా ఒక ఒంటరి సైన్యం”లా దృఢంగా నిలబడేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో తాను పెద్దగా యాక్టివ్గా ఉండక పోవడం గురించి కూడా ధృవ్ మాట్లాడారు. తరచుగా పోస్ట్లు పెట్టడం కంటే వీడియో ఎడిటింగ్ చేయడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటి వాటికే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కేవలం ప్రాజెక్ట్ ప్రమోషన్ల సమయంలోనే సోషల్ మీడియాను ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.