newsseals.com
News

అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు

VijayaBhaskar November 25, 2025
newsseals-MinisterParthasarathy
Spread the love

రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారథి

అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ఖసారధి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల‌తో పాటు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సచివాలయంలో మంగళవారం కలిశారు. జర్నలిస్టుల కోసం సిఆర్డీఎ ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల గృహ సముదాయాన్ని నాలుగు కేటగిరీలలో నిర్మించే నిమిత్తం 30 ఎకరాల భూమిని మందడం, తుళ్లూరు పరిధిలో అమరావతి హౌసింగ్ సొసైటీకి 2019లో కేటాయించటం జరిగిందని వారు వివరించారు. దానిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ సిఆర్డీఏ సంస్థనే డెవలపర్ గా దాని ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ నిర్మించాలని సొసైటీ గతంలో ప్రభుత్వాన్ని కోరింద‌ని చెప్పారు.

కాగా సొసైటీకి కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని మంత్రికి వివ‌రించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 107 ఇస్తూ హ్యాపీనెస్ట్ మోడల్ లో నిర్మిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరుతూ పార్థసారధిని కోరారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను, హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తిని మంత్రి నారాయణ, సిఆర్డీఎ కమిషనర్ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు జరిగేలా అవసరమైన వారితో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. అందులో భాగంగా మంత్రి సారధి వెంటనే సమాచార శాఖ డైరక్టర్ విశ్వనాధ్ కు ఆదేశాలు జారీ చేశారు.