newsseals.com
SPORTS

ప్ర‌త్య‌ర్థులపై దాడి చేయ‌డం పైనే ఫోక‌స్

VijayaBhaskar June 1, 2026
newsseals-Vaibhav
Spread the love

యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కామెంట్స్

అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను ఏకంగా 76 సిక్సులు కొట్టాడు. క‌గిసో ర‌బాడా, పాట్ కమిన్స్, భువేన‌శ్వ‌ర్ కుమార్, సిరాజ్ , ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ క్లాస్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను ప‌లుమార్లు సెంచ‌రీకి చేరువ‌లో వ‌చ్చి చేయ‌కుండానే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఎలిమినేట‌ర్ -2 మ్యాచ్ లో త‌ను 96 ర‌న్స్ చేశాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ లో తాము ఆర్సీబీతో ఆడుతామ‌ని అనుకున్నాన‌ని కానీ త‌మ ఆశ‌ల‌పై గుజ‌రాత్ టైటాన్స్ నీళ్లు చ‌ల్లింద‌న్నాడు. ఈ సంద‌ర్బంగా త‌ను కూడా అహ్మ‌దాబాద్ కు చేరుకున్నాడు ఫైన‌ల్ మ్యాచ్ చూశాడు.

మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఐపీఎల్ 19 సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ర‌న్ మెషీన్ మ‌రోసారి మెరిసాడు. త‌ను ఒక్కేడ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో స‌త్తా చాటాడు. 75 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజన్‌లో, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలి, అలాగే సందర్భానికి అనుగుణంగా నా ఆట తీరును ఎలా మార్చుకోవాలి అనే విషయాలను నేను నేర్చుకున్నాను.ప్రతి మ్యాచ్‌నూ ఒకే రకమైన మనస్తత్వంతో ఆడలేమన్నాడు. మీరు ఆటలోని పరిస్థితిని అంచనా వేసి, జట్టుకు ఆ సమయంలో ఏది అవసరమో దానికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.