కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు హామీ ఇచ్చారు.

ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేయాలంటే ముందుగా టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానం చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఈ స‌ద‌ర్బంగా సాయం చేసేందుకు వీలు కుదురుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం టీటీడీకి భారీ ఆదాయం స‌మ‌కూరుతున్నా, దేశ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఆల‌యాల‌ను నిర్మించే ప‌నిలో ఉంద‌న్నారు ఈ సంద‌ర్బంగా టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భార‌తీయ సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని చెప్పారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *