శ్రీ ర‌మ‌ణ దీక్షితులు ప్ర‌య‌త్నం అభినంద‌నీయం

ప్ర‌శంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని రచయిత శ్రీ రమణ దీక్షితులు పుస్తకంలో పొందుపరిచారు.

ఈ సంద‌ర్బంగా శ్రీ ర‌మ‌ణ దీక్షితులు చేసిన ప్ర‌య‌త్నాన్ని కొనియాడారు టీటీడీ చైర్మ‌న్. ఎన్నో ఏళ్లుగా క‌లియుగ దైవ‌మైన‌, కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగిన దేవ దేవుడు, శ్రీ క‌లియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో ప్ర‌ధాన అర్చ‌కులుగా విశిష్ట సేవ‌లు అందించార‌ని పేర్కొన్నారు. ఆయ‌న‌కు ఈ ఆల‌యం ప‌ట్ల అపార‌మైన అవ‌గాహ‌న‌, అనుభ‌వం ఉంద‌న్నారు బీఆర్ నాయుడు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పుస్త‌కాలు రాయాల‌ని ఆకాంక్షించారు. నిత్యం తిరుమ‌ల‌ను సందర్శించే భ‌క్తుల‌కు ఇది మ‌రింత ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *