సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

నారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్

తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా లోకేష్ , మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ తో పాటు కుటుంబీకులు సంద‌డి చేశారు. ప్ర‌తి పండుగ‌కు త‌న స్వంత ఊరులో సంద‌డి చేస్తారు. సీఎం రాక సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఈ స‌ద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నారా వారి పల్లెకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం దంప‌తుల‌కు ఆ క‌లియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి తీర్థ ప్ర‌సాదాల‌తో పాటు చిత్ర ప‌టాన్ని అంద‌జేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేద పండితులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *