ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్

కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను మీడియాతో మాట్లాడారు. వికెట్ కీప‌ర్ గా ఉన్న సంజూ శాంస‌న్ ను త‌ప్పించి ఇషాన్ కిష‌న్ ను ఉప‌యోగించార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. ఈ రోజు మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు కదా, మరి ఈ రోజు ఇషాన్ కిషన్ ఎందుకు వికెట్ కీపింగ్ చేశాడ‌ని అడిగిన మీడియాకు దిమ్మ తిరిగేలా ఆన్స‌ర్ ఇచ్చాడు.

ఈ సిరీస్ ప్రారంభంలో, మూడు మ్యాచ్‌లకు సంజూ శాంస‌న్ ను , ఒక మ్యాచ్‌కు ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్‌గా ఉంచాలని తాము ముందే ప్లాన్ చేసుకున్నామ‌ని చెప్పాడు సూర్య కుమార్ యాద‌వ్. గాయం కారణంగా ఇషాన్ కిషన్ గత మ్యాచ్ ఆడలేక పోవడంతో, సంజూ వికెట్ కీపింగ్ చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మాకు అవకాశం లభించడంతో, ఇషాన్ కిషన్‌తో వికెట్ కీపింగ్ చేయించడం జ‌రిగింద‌న్నాడు. కావాల‌ని శాంస‌న్ ను త‌ప్పించ లేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌ను కూడా త‌మ టీంలో స‌భ్యుడిగా ఉంటాడ‌ని చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా శాంస‌న్ కు 5 మ్యాచ్ ల‌లో ఆడేందుకు అవ‌కాశం ఇచ్చారు హెడ్ కోచ్ గంభీర్. త‌ను ఈ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోయాడు. త‌ను 10, 6, 0, 24, 6 ప‌రుగులు చేశాడు. దీంతో రాబోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న‌కు బ‌దులు ఇషాన్ కిష‌న్ ను వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించాడు గంభీర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *