క‌న‌క‌దుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య అర్చ‌కులు

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బెజ‌వాడ‌లో కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించారు.

అమ్మవారి దర్శనార్థం వచ్చిన తెలుగు రాష్ట్రాల భక్తులు మంత్రితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, మంత్రి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రి వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలుగా విడి పోయినా మ‌నంద‌రం ఒక్క‌టేనని అన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *