త‌ప్పు చేసిన వారికి చంద్ర‌బాబు అండ‌దండ‌లు

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమరావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం జ‌గ‌న్ రెడ్డి మంగ‌ళ‌గిరి లోని ప్ర‌ధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. నేరాలు, ఘోరాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా , ప్ర‌భుత్వం ప‌ని చేస్తోందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే పైకేమో డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు త‌న పార్టీకి చెందిన వారు డ్ర‌గ్స్ లో ప‌ట్టు ప‌డితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడు.. పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. పుట్టా మహేష్‌తో మొదలై, పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం అని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి.. తప్పు చేసిన వారిపట్ల ఇప్ప‌టి వ‌ర‌కు చర్యలు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు.. అందుకే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు.. అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నార‌ని ఆరోపించారు. కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడిచేస్తే చర్యలు ఏవీ అని నిల‌దీశారు సీఎంను.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *