సింహాచ‌లంలో ఘ‌నంగా చంద‌నోత్స‌వం

ద‌ర్శ‌నం కోసం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ‌త ఏడాది ల‌క్షా 25 వేల మంది భ‌క్తులు ద‌ర్శించు కోగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా అధికారులు, పోలీసులకు దిశానిర్దేశం చేశాం అని స్ప‌ష్టం చేశారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్ప‌స్టం చేశారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం NDRF/SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు అనిత వంగ‌ల‌పూడి. ఏఐ (AI) టెక్నాలజీ, సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించ‌డం జ‌రిగింద‌న్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *