ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి స‌విత
శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని చెత్త ఊడ్చారు. స్వయంగా మంత్రి తన చేతులతో చెత్త తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. క్లీన్ పెనుకొండ – గ్రీన్ పెనుకొండకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రతి నెలా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల పరిశుభ్రత, రెండో వారంలో కాల్వల శుభ్రత, మూడో వారంలో చెత్త వేరు చేయడంపై అవగాహన, నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు ఎస్. స‌విత‌. పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం అని స్ప‌ష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలి అని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *