ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం. ప‌ర్యావ‌ర‌ణ హితంగా బ‌స్సులు ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో భాగంగానే ఇక నుంచి అన్ని విభాగాల‌లో ఈవీ బ‌స్సులు వినియోగించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌లిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. రానున్న రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

స్త్రీ శక్తి పథకం ఆర్టీసీపై భారం కాదని , ఇది సామాజిక బాధ్య‌త అని తాము భావిస్తున్నామ‌న్నారు .
ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్ల‌డించారు. సిబ్బంది, కండెక్ట‌ర్లు, మెకానిక్ లు, డ్రైవ‌ర్లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు మధ్య విడదీయరని అనుబంధం ఉందన్నారు. పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతాం అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. రెండేళ్లలో నైట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారం చేశామ‌ని తెలిపారు. 3000 కొత్త ఈవీ బస్సులతో ఆర్టీసీకి కొత్త రూపు రానుందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *