23.20 బిలియ‌న్ల‌కు చేరుకున్న డిజిట‌ల్ చెల్లింపులు

రూ. 30 ల‌క్ష‌ల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం

ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొన‌సాగుతోంది. ఏకంగా గ‌త మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్ష‌న్ విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మే 2026లో 23.20 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. వీటి మొత్తం లావాదేవీల విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తోంది.

పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం, వ్యాపారుల విస్తృత ఆమోదం, విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా, యూపీఐ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది. రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా కోట్లాది మంది ప్ర‌తి రోజూ త‌మ రోజూ వారీ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి లావాదేవీలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు బ్యాంకింగ్ రంగ వ్య‌వ‌స్థ కంటే ఈ డిజిట‌ల్ చెల్లింపులపై దృష్టి సారించారు ఖాతాల వినియోగ‌దారులు. ఈ విష‌యాన్ని ఇవాళ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *