తెలంగాణ మీ అయ్య జాగీరా..?

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

హైద‌రాబాద్ : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ‌పై నోరు పారేసుకున్నారు. రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. దాడులు చేస్తారా అయితే ఇక్క‌డే ఉంటా ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు .తెలంగాణపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కొండగట్టు అంజన్నకు ముప్పై కోట్లు ఇచ్చానని అన్నారు. అడ్డుకుంటారా..? నేనే తిరుగుతా ఇక్కడ అంతటా..! ఇప్పుడు డిసైడ్ అయ్యాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం అని మీరెవరు అడ్డుకోవడానికి అని నిల‌దీశారు.

తెలంగాణా లో జనసేన ఉంటుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలా తిరుగుతావ్ తెలంగాణలో అంటున్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఇలాగే అన్నారు అప్పట్లో అని గుర్తు చేశారు. ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇది నా దేశం నేను ఎక్కడైనా అడుగు పెట్టేందుకు హ‌క్కు ఉంద‌న్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కేరళం లో , వయనాడు లో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేయొచ్చు. మేము వస్తె అడ్డుకుంటారా అని అన్నారు. కాంగ్రెస్ కు ఒక పద్ధతి ఉందా.. ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను చెరువును కబ్జా చేశానా..అలా కబ్జా చేసి ఉంటే విడిచిపెట్టే వాళ్లా అని నిల‌దీశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *