newsseals.com
News

ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

VijayaBhaskar June 2, 2026
newsseals-BurraVenkatesham
Spread the love

20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి

హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్లు ఇవ్వ‌లేమంటూ బాంబు పేల్చారు. నిరుద్యోగుల‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమ‌న్నారు బుర్రా వెంక‌టేశం.

ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం అని చెప్ప‌డం ప‌ట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వ‌లేని సంస్థ ఉండీ ఏం లాభ‌మ‌ని ప్ర‌శ్నించారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను మీడియా నియంత్రించాల‌ని సూచించారు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్. దీంతో ఇక జాబ్స్ భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు.