జీతాలు అంద‌క అంగన్‌వాడీ టీచర్ల ఇక్క‌ట్లు

ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన ఇస్తామ‌న్న స‌ర్కార్

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డంలో విఫ‌లం అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన అంద‌రికీ వేత‌నాలు వారి వారి ఖాతాల‌లో జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. కేవ‌లం రోజూ వారీ ఖ‌ర్చుల‌కు కూడా న‌డ‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని టాక్. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి నెల 1వ తేదీనే జీతాలు అనే ప్రతిపాదన కేవలం ప్రచారానికే పరిమితం అయ్యింద‌టూ వాపోతున్నారు ప‌లువురు బాధిత ఉద్యోగులు. మొన్న‌టికి మొన్న రిటైర్డ్ ఎంప్లాయిస్ త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. చివ‌ర‌కు కోర్టు సీరియ‌స్ కావ‌డంతో కొంత స‌ర్దుబాటు చేసింది.

మ‌రో వైపు పదవీ బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడిచినా ఇంకా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు సర్పంచులు. ఇంకో వైపు గత రెండు నెలలుగా జీతాలు అందక పోవ‌డంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు . డిసెంబర్ 22, 2025న బాధ్యతలు చేపట్టిన 12,762 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు, ఒక్కొక్కరికి ₹32,500 చొప్పున మొత్తం ₹41.28 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 62,000 మంది అంగన్‌వాడీ టీచర్లు , సహాయకులకు రెండు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించ లేద‌ని వాపోయారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *