కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తాన‌న్న అన్నామ‌లై

త‌న రాజీనామాను ఆమోదించిన బీజేపీ

చెన్నై : బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లై రాజీనామాను పార్టీ హైక‌మాండ్ ఆమోదించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పార్టీ చీఫ్ నితిన్ న‌బిన్ త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని కూడా ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో కె. అన్నామ‌లైకి బీజేపీకి మ‌ధ్య బంధం తెగి పోయింది ఇవాల్టి నుంచి. ఈ సంద‌ర్బంగా త‌న రాజీనామా విష‌యంలో పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ కీల‌క నేత బీఎల్ సంతోష్, నితిన్ న‌బిన్. కానీ కె అన్నామ‌లై ఒప్పుకోలేదు. దీంతో గ‌త్యంత‌రం లేక అన్నామ‌లై రాజీనామాను ఆమోదించ‌క త‌ప్ప‌లేదు.

మ‌రో వైపు బీజేపీ నేరుగా త‌మిళ‌నాడులో ప్ర‌వేశించ‌డం క‌ష్టంగా ఉంద‌ని, దీంతో కావాలనే అమిత్ షా ప్లాన్ లో భాగంగానే కె. అన్నామ‌లైతో పార్టీ పెట్టిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఇవాళ త‌న రాజీనామా ఆమోదించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కె. అన్నామ‌లై. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడాడు. కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించాడు.రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ తరపున క్రమం తప్పకుండా వివిధ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఈ వ్యక్తికి, ఆ పార్టీ ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా కేటాయించలేదు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *