నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం కూడా

బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . త‌న‌ను బీసీసీఐ టి20 జ‌ట్టులోకి తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశాడు. ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. తాను ఒకప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు సపోర్టర్ అని చెప్పాడు వైభ‌వ్ సూర్య వంశీ. ఎప్పటికీ కోహ్లీకి అభిమానినని వైభవ్ సూర్యవంశీ వెల్లడించారు. IPL సందర్భంగా విరాట్ తన భుజంపై చేయి వేసి మాట్లాడటం ఒక కలలా అనిపించిందన్నారు.

ఆయన తనను తమ్ముడిలా ట్రీట్ చేశారని రాజస్థాన్ రాయ‌ల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. ‘కోహ్లీ నాకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారు. లోపాలు, బలాల గురించి వివరించారు. దేనిపై దృష్టిపెట్టాలో చెప్పిన తీరు అద్భుతం’ అని తెలిపాడు సూర్య‌వంశీ. ఇదిలా ఉండ‌గా తాజాగా ఇండియాలో జ‌రిగిన జ‌నాద‌ర‌ణ పొందిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేశాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున‌. అంతే కాదు 76 సిక్సుల‌తో రికార్డు సృష్టించాడు. ఫోర్లు, సిక్సుల‌తో హోరెత్తించాడు. టాప్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *