మోహ‌న్ నాయ‌క్ ఆస్తులు రూ. 200 కోట్ల పైనే

గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్

హైద‌రాబాద్ : ఏసీబీ భారీ తిమింగ‌లాన్ని వ‌ల ప‌న్ని ప‌ట్టుకుంది. ఆర్ అండ్ బిలో ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గా ప‌ని చేస్తున్న మోహ‌న్ నాయ‌క్ ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. మోసపూరిత టెండర్ల ద్వారా కోట్లు పోగు చేశాడు. తెలంగాణ ఆర్&బి చీఫ్ జె. మోహన్ నాయక్, అవినీతి కాంట్రాక్టర్ల లంచాలతో సమకూర్చిన బంగారు బిస్కెట్లు, నగదు, విలాసవంతమైన విల్లాల సిగ్గుచేటైన నిల్వలను ఏసీబీ దాడులు బయటపెట్టడంతో పతనం అంచున నిలిచారు. ఇదిలా ఉండ‌గా త‌ను మాజీ మంత్రి కేటీఆర్ కు అభిమానిగా ఉన్నారు. ఇది సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఆర్ అండ్ చీఫ్ ఇంజ‌నీర్ ఇంట్లో భారీ ఎత్తున న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు, బంగారు బిస్కెట్లు, ఆస్తులు, ఫ్లాట్స్ , ప్లాట్లు, భూముల‌కు సంబంధించిన లావాదేవీలు, ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్‌లో 7 ఫ్లాట్లు, మియాపూర్‌లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో మరో కొత్త ఇల్లు , 19.38 ఎకరాల వ్యవసాయ భూమి (5 ప్లాట్లు), మరో విల్లా కోసం చెల్లించిన ₹1 కోటి అడ్వాన్స్ తో పాటు ₹55 లక్షల నగదు, దాదాపు ₹2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో ₹1.44 కోట్లు, ₹1.26 కోట్ల విలువైన విలాసవంతమైన గృహోపకరణాలు, 9 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు , 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *