జి7 స‌ద‌స్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ

స్లోవేకియా లో కూడా ప‌ర్య‌టించ‌నున్న పీఎం

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జీ 7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఫ్రాన్స్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు తమ‌ సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచామని పేర్కొన్నారు. ఈ టూర్ సంద‌ర్బంగా ఇరు దేశాల‌లో ఏడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ప్రపంచ నాయకులతో చర్చలు జరుపుతారు. బయలుదేరే ముందు ఇచ్చిన ప్రకటనలో, భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని మోదీ పేర్కొన్నారు.

అలాగే, 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాన మంత్రి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం ఒక చారిత్రక మైలురాయి అని, ఇది ద్వైపాక్షిక సంబంధాలలో పెరుగుతున్న సానుకూలతను మరింత బలపరుస్తుందని ఆయన అన్నారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు, అప్పుడు మేము మా సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచామని పేర్కొన్నారు ప్ర‌ధాని మోదీ.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *